Monday, October 02, 2006

చక్కెరపొంగలి

కావలసినవి

బియ్యం - 250గ్రా
పెసరపప్పు - 100గ్రా
యాలకులు - 5గ్రా
చక్కెర - 300గ్రా
జీడిపప్పు - 25గ్రా
కిస్మిస్ - 25గ్రా
నెయ్యి - 60గ్రా
ఎండుకొబ్బరి - 50గ్రా (తురిమినది)
పాలు - 1లీ
పచ్చకర్పూరం - చిటికెడు


తయారుచేసే పద్ధతి

బియ్యం,పెసరపప్పులను బాగా నీళ్ళలో కడిగి నీళ్ళు లేకుండా వంచేయాలి.
ఒక గిన్నెలోనెయ్యి తీసుకొని అందులో బియ్యం,పెసరపప్పు వేసి 5నిమిషాలు వేయించవలెను.
బియ్యం చిటపటలాడుతుండగా పాలుపోసి బాగా కలిపి మూతపెట్టి ఉడకబెట్టవలెను.
పూర్తిగా ఉడికినతర్వాత స్టవ్ మీది నుంచి దించి చక్కెర కలపవలెను.
తర్వాత ఒక చిన్న బాణలిలో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు,కిస్మిస్,తురిమిన ఎండుకొబ్బరిని వేయించి వాటికి చిటికెడు పచ్చకర్పూరం చేర్చి పొంగలిలో కలపవలెను.ఆపైన యాలకులపొడి చల్లవలెను.
ఘుమఘుమలాడే.....చక్కెరపొంగలి మీకోసం.....

2 comments:

రాధిక said...

ii roje mii blog cuusanu.mamci aamdhra vamtalu amdistunnamduku thanks

Unknown said...

edi chaduvutu untene na nooru orutundi baboi ... hehehe :)