Monday, October 02, 2006

చేగోడీలు

కావలసినవి

బియ్యపు పిండి - 3గ్లాసులు
మైదా - 1గ్లాసు
నెయ్యి - 50గ్రా
వాము - 1/2టీస్పూను
పసుపు - 1/4టీస్పూను
కారంపొడి - 1/2టీస్పూను
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి సరిపడినంత


తయారుచేసే పద్ధతి

ముందుగా ఒక గిన్నెలో నాలుగు గ్లాసుల నీళ్ళు పోసి ఎసరు పెట్టవలెను.
దానిలో తగినంత ఉప్పు వేసి ఎసరు మరిగిన తర్వాత స్టవ్ మీది నుంచి దించవలెను.
ఇప్పుడు వాము,కారంపొడి,పసుపు వేసి వెంటనే మొత్తం బియ్యపుపిండి,మైదాలను కలిపి దానిపైన నెయ్యి పోసి గిన్నెపై మూతపెట్టవలెను.

పిండి కొంచెం చల్లారిన తర్వాత పిండి ముద్దను రెండు అరిచేతులతో బాగా నలిపి సన్నగా తాడులా పొడవుగాచేసి కావలసిన సైజులో రింగులుగా అంటే గుండ్రంగా చేసి వేడినూనెలో ఎర్రగా వేయించి తీసేయవలెను. కరకరలాడే కమ్మని చేగోడీలు సిద్ధం.

No comments: