గోంగూరపచ్చడి
కావలసిన పదార్దాలు
గోంగూర(ముదిరిన ఆకు) - 1kg
ఉప్పు - 500gm
ఎండుమిర్చి - 250gm
చింతపండు - 250gm
పోపు(తగినంత)
మెంతులు - 20gm
వెల్లుల్లి పాయలు - 250gm
పసుపు - 2స్పూన్లు
నువ్వుల నూనె - 600gm
తయారుచేయు విధానం
ఆకును శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి.
బాగా ఒడలిన తర్వాత కొంచెం నూనె వేసి వేయించాలి.
కొద్దిగా ఉప్పు, పసుపు కలిపి రెండు రోజులు పక్కన పెట్టాలి.
మూడవ రోజున చింతపండు బాగా వేడినీళ్ళలోనానబెట్టాలి.అది గుజ్జులాగ తయారవ్వాలి.
ఎండుమిరపకాయలు నూనెలో వేయించాలి.తర్వాత వెల్లుల్లిపాయలు దంచుకోవాలి.మెంతుల్ని వేయించి పొడి చేయాలి.
అన్ని కలిపి ఆకుతో సహా మిక్సీలోవేయాలి.
మిగిలిన నూనెను బాగా కాచి మూడు స్పూన్ల శనగపప్పు,మినపపప్పు,ఆవాలు,కొద్దిగా ఎండుమిరపకాయలు,కరివేపాకు,కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసి దించేయాలి.
చల్లారిన తర్వాతపచ్చడిలో కలపాలి.
ఇక....రుచికరమైన గోంగూర పచ్చడి....మీదే....
2 comments:
ఆహా ఏమి రుచి, అనరా మైమరచి :-)
Hi,
I would like to take over your blog, if you permit. I like the name of the blog : http://annalakshmi.blogspot.com/
Thank you
Vidhya
Post a Comment