Wednesday, September 27, 2006

రవ్వ పులిహోర


కావలసినవి

సన్న నూకబియ్యం - 500గ్రా
నీళ్ళు - 1లీ
నూనె -75గ్రా
సెనగపప్పు - 20గ్రా
ఆవాలు - 5గ్రా
మినప్పప్పు - 20గ్రా
ఇంగువ - చిటికెడు
వేరుశెనగ గుళ్లు - 25గ్రా
ఎండుమిర్చి - 8
పచ్చిమిర్చి - 10
కరివేపాకు - 8రెబ్బలు
చింతపండు - 100గ్రా
పసుపు - 1టీస్పూను
ఉప్పు - తగినంత

తయారుచేసే పద్దతి

ఒక గిన్నెలో నీళ్లు ఎసరుపెట్టి, దానిలో బియ్యపురవ్వ కలిపి పొడిపొడిగా ఉడికాక స్ట్హ్హౌ మీది నుంచి కిందికి దించి, రెండు స్పూన్ల నూనె పైన పోసి, మూతపెట్టి ఉమ్మగిల్లే వరకు ఉంచవలెను.

తరువాత దీన్ని ఒక వెడల్పు పళ్లెంలో తీసి చల్లార్చవలెను.పొడిగా ఉండేలా చేతితో చిదమవలెను.

ఇప్పుడు ఒక కళాయిలో నూనె పోసి కాగిన తరువాత చింతపండు తప్ప, మిగిలినవన్నీవేసి ఎర్రగా పోపు వేయించి, ఆ తరువాత చింతపండు గుజ్జు పిండి ఉడికించవలెను.

ఈ మిశ్రమాన్ని పళ్లెంలో చల్లర్చిన రవ్వపిండితో కలిపి, తగినంత ఉప్పు కలిపితే కమ్మని రుచి గల రవ్వ పులిహోర మీ కోసం...రెడీ....

Saturday, September 23, 2006

ఆంధ్ర పప్పు చారు

నలుగురికి సరిపోయే విధంగా పప్పు చారు కోసం దినుసులు

పోపు దినుసులు
ధనియాలు - ఒకటిన్నర టీ స్పూను
ఆవాలు - ఒకటి టీ స్పూను
మెంతులు - అర టీ స్పూను
జీలకర్ర - ఒకటిన్నర టీ స్పూను
వెల్లుల్లి - అయిదు రెమ్మలు (దంచి పెట్టుకోవాలి)
కరివేపాకు - పది ఆకులు
పచ్చి మిర్చి - మూడు (నిలువుగా చీల్చి పెట్టుకోవాలి)
ఉల్లి - నాలుగు (చిన్నవి)
పసుపు - అర టీ స్పూను
కారం - ఒకటిన్నర టీ స్పూను
సాంబారు పొడి - మూడు టీ స్పూనులు
ఉప్పు - తగినంత
చింతపండు - ఏభై గ్రాములు

కూరగాయలు & దినుసులు

వంకాయలు - మూడు (మధ్యరకం సైజువి)
మునగకాయలు - నాలుగు కాయలు (మధ్యరకం ముక్కలు)
బెండకాయలు - పది కాయలు (మధ్యరకం ముక్కలు)
ముల్లంగి - రెండు (చక్రాల్లా తరిగినవి)
టొమేటో - అయిదు (నిలువుగా కోసిన ముక్కలు)
కంది పప్పు - రెండు వందల గ్రాములు (మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి)

తయారుచేసే విధానం

ముందుగా బాణలి తీసుకుని, నాలుగు స్పూనుల నూనె వేసి పోపు దినుసులన్ని ఒకొక్కటిగా వేసి కమ్మని వాసన వచ్చే వరకు వేయించాలి.

తరువాత తరిగిన కూరగాయలన్ని ఒకొక్కటిగా వేసి ఆ పోపులో అయిదు నిమిషాలు వేయించాలి.

తరువాత కొద్దిగా పసుపు, కారం వేసి ముక్కలన్ని కలియ పెట్టాలి. ఉప్పు పైన చల్లి, మరలా కలియబెట్టి మూత పెట్టి స్టవ్ మంట తగ్గించిపది నిముషాలు ఉంచి స్టవ్ ఆపి వేయాలి.

ఇప్పుడు ఒక పాత్ర తీసుకుని, దానిలో ఉడికిన కంది పప్పు ముద్ద వేసి, నీరు కాస్త కలపి స్టవ్ మీద పెట్టాలి.

కాసేపటి తరువాత పక్కన ఉంచిన ఉడికిన కూరగాయలన్ని ఈ మరుగుతున్నపప్పులో వేయాలి.

అయిదు నిమిషాలు మరిగిన తరువాత ఒక సారి కలియబెట్టి ఉడుకుతున్నప్పుడే సాంబారు పొడి, చింత పండు రసం కలపి బాగా కలియబెట్టాలి.

ఇంకొక పది నిమిషాలుఈ మిశ్రమాన్ని ఉడకనిచ్చి దించేస్తే ఘుమ ఘుమ లాడే కమ్మని పప్పు చారు సిద్ధం.